తేటగుంటలో తుని సమీపంలో టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై.భీమ్ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ బృందం లోకేశ్ కు కలిసారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల కోసం లోకేశ్ కు వివరించారు. ఈ దాడులను ఖండించాలని జై.భీమ్ మాల మహానాడు తుని బృందం వినతి పత్రాన్ని తోకేశ్ కు అందజేశారు.
రాష్ట్రంలో దళితులపై రోజురోజుకీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, పెరిగిపోతున్నాయని తెలిపారు. అధికారు పార్టీ నిందితులను కాపాడుతుందని అన్నారు. టీ.డీ.పీ అధికారంలోకి రాగానే నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో దళితులకు కేటాయించిన నిధులను ప్రభుత్వం నవరత్నాలు పేరుతో పెత్తనం చేస్తుందని అన్నారు.