తుఫాన్ ప్రభావానికి గురయిన ప్రాంతాలలో అధికారుల బృందాలను నియమించి నిరంతంగా పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎప్పటికప్పుడు నివాస యోగ్యమైన ప్రాంతాలలో ముంపు నివారణకు, అలాగే రైతు పంట క్షేత్రాలలో ముంపు నివారణకు ఉపాధి హామీ అనుసంధానంతో, గ్రామపంచాయతీల సహకారంతో ముంపు నీరు తొలగింపు కొరకు డ్రయిన్ లాకులకు అడ్డంగా ఉన్న తాడు తీసేందుకు చర్యలు చేపట్టారన్నారు. తుఫాన్ పరిస్థితులను మానిటరింగ్ చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… డెల్టా ఆధునీకరణకు మంత్రి ఆమోదంతో దశల వారీగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అల్లవరం మండలంలో ఇటీవల కాలంలో ముoపు తొలగింపుకు ఐదు కోట్ల రూపాయలు మేర పనులు చేపట్టామ న్నారు. వాటి ఫలితంగా నేడు రామేశ్వరం మొగద్వారా సవ్యంగా నీరు సముద్రం లోనికి ప్రవేశిస్తుందన్నారు. దీని వల్ల మండల పరిధిలో ముంపు ప్రభావం చాలావరకు తగ్గిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో స్వర్ణ, 1318 రకాల పంటలు నీట మునిగాయని ఆయన తెలిపారు.
తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యవేక్షణ…
![WhatsApp Image 2023-12-05 at 4.27.48 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-05-at-4.27.48-PM.jpeg?resize=1280%2C700&ssl=1)