మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వారం రోజుల నుండి వేటకు వెళ్ళని మత్స్యకారులు పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు. కాకినాడ లో సుమారుగా 1500 బోట్ల పైన 10 వేల మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆయనన్నారు. వేట నిషేధం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్పా… తుఫాన్ ల వల్ల ఉపాధి లేకపోయినా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని విమర్శించారు.
తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులు వరకు వేటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉందని తాము ఎలా బ్రతకాలని మత్స్యకారులు తమ వద్ద వాపోయారని సి.పి.ఎం., మత్స్య కార్మిక సంఘం నాయకులు తెలిపారు. వేటకు వెళ్లే… బోట్, రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి బియ్యం, నూనె, పప్పు అందించాలని సి.పి.ఎం., మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మికుసంఘం నాయకులు యు. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు