గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…
![WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-08-at-8.35.39-AM.jpeg?resize=1280%2C700&ssl=1)