తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం కొన్ని నియోజకవర్గాల్లో రసాభసగా ఉంటుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తోంది. అధికార పార్టీ నుంచి ఇరుపార్టీల సమన్వయం వైపు భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట వెంకటకృష్ణరాయపురానికి చెందిన వైఎస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావుతో పాటు పంచాయితీ వార్డ్ మెంబర్స్, కన్వీనర్ పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ పరిణామంతో ఇరుపార్టీల సమన్వయంలో మరికొంత జోష్ పెరిగిందని స్థానిక నాయకులు చెబుతున్నారు.