తెలుగు ప్రజల గొప్పతనానికి నిదర్శనం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చేసిన పోరాట ప్రతిభను ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి లు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లోనూ, మఠం సెంటర్ లోని పొట్టి శ్రీరాములు పార్కు వద్ద జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జే. రామారావు ఆధ్వర్యంలో లోనూ, పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్ర విభజనకు చేసిన కృషిని కొనియాడారు.
తెలుగు వారి గొప్పతనానికి నిదర్శనం పొట్టి శ్రీరాములు…
![WhatsApp Image 2023-11-01 at 8.48.27 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-01-at-8.48.27-PM.jpeg?resize=1280%2C700&ssl=1)