Political

త్వరలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పునరుద్దరణ.. స్మార్ట్‌సిటీ ఎండీ నాగనరసింహారావు వెల్లడి

WhatsApp Image 2023-10-19 at 8.07.29 AM

స్మార్ట్‌సిటీ పర్యవేక్షణలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)ను త్వరలోనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్మార్ట్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీ.ఈ.వో, నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఐసీసీసీని పునరుద్దరించే అంశంపై తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… రూ. 98 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌ నిర్వహణ చేసేందుకు మూడు ఏజన్సీలతో మాట్లాడామన్నారు. ఇందులో ఒక ఏజన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బెంగుళూరు, పరిదాబాద్, గురుగామ్‌ వంటి స్మార్ట్‌సిటీలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను కూడా ఓ సంస్థ సమర్థవంతంగా నిర్వహిస్తోందని, ఇక్కడ కూడా ఆ సంస్థకు అప్పగించే అంశంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. స్మార్ట్ సిటీ నిబంధనల మేరకు సంబంధిత సంస్థతో చర్చించాలని ఆయన అధికారులకు సూచించారు. సాధ్యమైనంతత్వరగా ఐసీసీసీ పునరుద్దరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ పి.వెంకట్రావు, కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.