గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారన్న కక్షతో ఆ గ్రామంలోని దళిత యువకులే లక్ష్యంగా వారిపై భౌతిక దాడులు, రోడ్లపై కారులతో ఢీకొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చంపేస్తానని బెదిరిస్తుండడంతో దళితులు అక్కడ నాయకుల అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూసి కారుకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో దళిత యువకులు హర్షం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే… జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం అగ్రవర్ణానికి చెందిన కుటుంబ సభ్యులు తోలాటం వీరబాబు, తోలాటం రమేష్, తోలాటం మహేష్, తోలాతం ఆదిబాబు అనేవారు గ్రామంలో కోడిపందాలు, జూదం, గుండాట, గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అయితే వారికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో గ్రామంలో ఈ కుటుంబ సభ్యుల ఆగడాలు హద్దులు మీరడంతో అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు గోల్లారపు సంజయ్ స్థానిక జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
అయితే ఎస్.ఐ. నాగార్జున రాజు దళితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే తిరిగి వారిపై అక్రమ కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేస్తానని బెదిరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఎస్.ఐ. చర్యలకు ఆత్మాభిమానం దెబ్బతిని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా దానిని వారించి స్థానికంగా ఉన్న దళిత నాయకుడు వేమగిరి శ్యాంబాబు వద్ద ప్రస్తావించారు. ఆయన చొరవతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను సంప్రదించి గ్రామంలో జరుగుతున్న ఘటనలను ఆయనకు వివరించారు.