కాకినాడ లో పీ.ఆర్. కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులకు, ఐ.ఈ.ఆర్.పీ. లకు శిక్షణ కార్యాక్రమన్నా నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఆర్జేడీ జి. నాగమణి విచ్చేశారు. ఆమే మాట్లాడుతూ… రాష్ట్ర సమగ్ర శిక్షణా సహితవిద్య విభాగం విజన్-2025లో భాగంగా ఇటీవల జిల్లా లోని దృష్టి, వినికిడి లోపం గల 250 మంది దివ్యాంగ విద్యార్థులకు సమగ్రశిక్షణ ద్వారా ట్యాబులను అందజేశారని, ఈ డిజిటల్ సాధనాల ద్వారా విద్యా బోధనపై సమగ్రశిక్షణ, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉపాద్యాయులకు, ఐ.ఈ.ఆర్.పీ. లకు శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగిందని అన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ సాధనాల ద్వారా విద్యను సులభతరం చేసేందుకు ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ట్యాబులను అందజేసినట్లు చెప్పారు.