తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు.
యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల మంత్రిత్వ శాఖ లో మై భారత్ అందరు రిజిస్ట్రేషన్ కావాలి అని సూచించారు. జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ మాట్లాడుతూ… యువతకు ఇది మంచి అవకాశం వారిలో దాగి ఉన్న వ్యక్తిత్వ వికాశానికీ ఉపయోగ పడుతోందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తమ స్పీకర్ గా షెకినా, ఉత్తమ ట్రబుల్షూటర్ కె. లక్ష్మీ లాలిత్య, ఉత్తమ కాన్షియస్నెస్ ప్రేమ్ సాయి చరణ్, బెస్ట్ రైజింగ్ స్టార్పార్లమెంటరీ వ్యవహారాలుగా యతీష్, ఉత్తమ ప్రశ్నకర్త గా పి. ప్రదీప్ నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ పి.ఓ., కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.