గతంలో దొంగ పట్టాలిచ్చి ప్రజలను మోసంచేసారని… తాజాగా దొంగ నోట్లో పంపిణీ తో ఓట్లు కొనుగోలు చేసి మరో సారి ఓటర్లను నట్టేట ముంచే పనిలో అధికార వైకాపా కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధి నిమగ్నమై య్యారని కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి , జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పంతం నానాజీ ఘాటు ఆరోపణలు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సి.హెచ్ కిషోర్ కి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అశేష ఆదరణ, జన స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.