జికా వైరస్ వ్యాప్తికి కారకమైన ఎడిస్ దోమ పట్ల అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ సూచించారు. ఆయన మీడియోతో మాట్లాడుతూ జికా వైరస్ పూర్తిస్థాయి నివారణ కు అవసరమైన ఔషధాలుగాని, ఇంజక్షన్లుగాని అందుబాటులో లేవన్నారు. కేవలం నివారణ చర్యలతో మాత్రమే అప్రమత్తంగా ఉండాలన్నారు. 2016 సంవత్సరంలో భారత దేశంలో ఈ వైరస్ ను గుర్తించడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు ఎక్కడా కూడా జికా వైరస్ వ్యాప్తి గాని, ఉనికి గాని భారతదేశంలో లేదన్నారు.
నీటి నిల్వలు లేకుండా, దోమల కాటు రాకుండా పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నివారణ చర్యలు లో భాగంగా ఫాగింగ్ చేసి ప్రజలలో అవగాహన కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ముందుస్తు చర్యలలో భాగంగా ఇంటి వాతావరణం లో నీటి నిల్వలు ఉంచకుండా ఉంటే ఎడిస్ దోమ ఉద్భవించే అవకాశాలు ఉంటాయని కేవలం మనం తీసుకునే చర్యలు మూలంగానే ఏడీస్ దోమ నివారణ మన చేతుల్లో ఉంటుందన్నారు.