News

దోమ పోటు … జికా వైరస్ కాటు..!

జికా వైరస్ వ్యాప్తికి కారకమైన ఎడిస్ దోమ పట్ల అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ సూచించారు. ఆయన మీడియోతో మాట్లాడుతూ జికా వైరస్ పూర్తిస్థాయి నివారణ కు అవసరమైన ఔషధాలుగాని, ఇంజక్షన్లుగాని అందుబాటులో లేవన్నారు. కేవలం నివారణ చర్యలతో మాత్రమే అప్రమత్తంగా ఉండాలన్నారు. 2016 సంవత్సరంలో భారత దేశంలో ఈ వైరస్ ను గుర్తించడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు ఎక్కడా కూడా జికా వైరస్ వ్యాప్తి గాని, ఉనికి గాని భారతదేశంలో లేదన్నారు.

నీటి నిల్వలు లేకుండా, దోమల కాటు రాకుండా పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నివారణ చర్యలు లో భాగంగా ఫాగింగ్ చేసి ప్రజలలో అవగాహన కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ముందుస్తు చర్యలలో భాగంగా ఇంటి వాతావరణం లో నీటి నిల్వలు ఉంచకుండా ఉంటే ఎడిస్ దోమ ఉద్భవించే అవకాశాలు ఉంటాయని కేవలం మనం తీసుకునే చర్యలు మూలంగానే ఏడీస్ దోమ నివారణ మన చేతుల్లో ఉంటుందన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం