Political

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ …

04122022130312n6

తూర్పు గోదావరి జిల్లాలో ధవలేశ్వరం లూధరన్ చర్చి వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు.

ప్రజాసేవ పరమావధిగా  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  వాలంటరీ వ్యవస్థను  ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పేద ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. పాలకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా మాత్రమే సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే ప్రజా సేవే లక్ష్యంగా పేద ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న పేదవారికి రక్షణ దేవుడిని నేడు మనిషి రూపంలో సహాయం చేస్తున్న దైవమే జగన్ మోహన్ రెడ్డి అని నేను విశ్వసిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.