ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి ఏ.పీ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కే.బీ. శంకరయ్య ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీ.జీ. కుమార్ విశ్వజిత్ ని కలిసారు. నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను మంజూరు చేస్తున్న రెవిన్యూ అధికారులపైన,ఆ సర్టిఫికెట్లు తీసుకున్న వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను రద్దు చేయాలని పీర్యాదు పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా కే.బీ. శంకరయ్య మాట్లాడుతూ… నకిలీ సర్టిఫికెట్లు రద్దు చేసి సంబందిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.