ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలుగుదేశం జండాలతో సైకిల్ యాత్ర చేస్తున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరుడు పుంగనూరు వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు సూరి నడిరోడ్డుపై బట్టలిప్పించి, టీడీపీ జెండాని కాలుతో తొక్కుతూ తిడుతున్న సంఘటన తీవ్ర చర్చానీయాంశంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు పసుపు రంగును చూస్తే తట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.