తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేసారు. వివరాల్లోకి వెళ్లే… నార్కట్పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని ఎస్.పీ. చందనా దీప్తి పర్యవేక్షణలో ఆమె చేతుల మీదుగా దహనం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో సీజ్ చేయబడిన సుమారు రూ. 5.10 కోట్ల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతులతో దహనం చేస్తున్నామని తెలిపారు. గంజాయి రావాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
నల్గొండ జిల్లాలో గంజాయి దహనం…!!!
![WhatsApp Image 2024-04-26 at 6.04.02 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-26-at-6.04.02-PM.jpeg?resize=1080%2C612&ssl=1)