విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లపూ భారత విద్యార్ధి ఫెడరేషన్ నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలు బంద్ కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి వాల్పోస్టర్లతో విస్త్రుత ప్రచారం చేపట్టారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో సంప్రదించి బంద్ ఆవశ్యకత పట్ల విద్యార్ధులకు అవగాహణ కల్పిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం పావులుకదుపుతున్న నేపద్యంలో, జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేయటం పట్ల విద్యాసంస్థల బంద్ ప్రాధాన్యతను సంతరించుకోనుంది.