సోమవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో కాకినాడ జోన్ నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా అత్యున్నత మార్కులు సాధించిన షేక్ ఉమ్మే కుల్సుమ్ (594/600), కే. భార్గవ్ రామ్ (594/600), ఎం.ఎల్.ఎస్. రాజేశ్వరి (592/600), సి.హెచ్. తనుశ్రీ (591/600), జి. భవిత లాస్య (590/600) లను ఉన్నారు.
ఈ సందర్బంగా నారాయణ పాఠశాలల ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు, జోనల్ కో-ఆర్డినేటర్ సుంకర మూర్తి, పాఠశాలల ప్రిన్సిపల్స్ షర్మిల, కవిత, రవికిషోర్, విఠల్ వారికి అభినందనలు తెలిపారు. ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… పోటీ ఏదైనా సాటిలేని నేటి విజయాల వేదిక నారాయణ అని తెలిపారు. ఈ విజయం వెనుక కృషిచేసిన ఉపాధ్యాయులను, అకాడమిక్ డీన్స్, టెన్త్ ఇన్చార్జిలను తల్లితండ్రులను, అత్యుత్తమ ప్రణాళిక రూపొందించిన ప్రిన్సిపాల్స్ ను జోనల్ కోఆర్డినేటర్ సుంకర మూర్తి అభినందించారు.