విశాఖపట్నం టీ.డీ.పీ. లోక్సభ అభ్యర్థి ఎం. శ్రీభరత్ అక్కయ్యపాలెంలో వైజాగ్ నార్త్ బీ.జే.పీ. అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజుతో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీభరత్ తన ప్రసంగిస్తూ… వై.ఎస్.ఆర్.సి. ప్రభుత్వ అసమర్థత కారణంగా విశాఖపట్నానికి మంజూరైన అనేక కేంద్ర ప్రాజెక్టులు మెటీరియలైజ్ కాలేదని ఎత్తిచూపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విశాఖపట్నం రైల్వే జోన్, మెట్రో రైలు ప్రాజెక్టు, ఐ.టీ., పారిశ్రామిక రంగాలు, టూరిజం అభివృద్ధిని విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్.డి.ఏ. ప్రభుత్వం ఏర్పడడం ఏ.పీ. ఆర్థికాభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుందనన్నారు. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి కేడర్ను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు.
నార్త్ వైజాగ్ లో రోడ్షో నిర్వహించిన త్రైపాక్షిక కూటమి…
![if-this-jungle-law-continues-jsp-tdp-bjp-must-unite_b_1605210844](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/if-this-jungle-law-continues-jsp-tdp-bjp-must-unite_b_1605210844.jpg?resize=700%2C333&ssl=1)