శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం లో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.ఏ. నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నాసిన్ అధికారులు కూడా పాల్గొన్నారు.