నిబద్ధతతో జెండా మోసే కార్యకర్తలే జనసేనకు బలమైన పునాదులని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురంలో నాగబాబుని కలిసిన అమలాపురం కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పొత్తు ధర్మంలో భాగంగా అమలాపురంలో కూటమి అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు ఐకమత్యంతో తలిసి పనిచేయాలని చెప్పారు.
ఎన్నికల అనంతరం అమలాపురంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి మొదటినుండి కష్టపడిన సమర్ధవంతమైన కార్యకర్తలతో కమిటీలు వేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, అమలాపురం నుండి సుధా వెంకటేష్, చిక్కం సుధ, చిక్కం సూర్యమోహన్, మహదాస నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.