సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నీట్ యుజి విద్యార్థుల కోసం కళాశాలల కౌన్సెలింగ్ను నిలిపివేయడానికి నిరాకరించింది. పరీక్ష పవిత్రత దెబ్బతింటుందని అందుకే ఎన్టీఏకు నోటీసులు జారీ చేసి స్పందన కోరామని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ జూలై 8న జరుగుతుందని కోర్టు తెలిపింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరినా.. మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయబోమని కోర్టు పేర్కొంది.
కాగా ఒక పరీక్షా కేంద్రంలోని 67 మంది అభ్యర్థులకు పూర్తి 720 మార్కులు వచ్చినట్లు పిటిషనర్లు తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కొత్త పిటిషన్లో మే 5 న జరిగిన నీట్ యుజి పరీక్ష పేపర్ లీక్పై విస్తృతమైన ఫిర్యాదులు కూడా ఉదహరించబడ్డాయి. ఇంతకు ముందు కూడా పేపర్ లీక్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలంటూ రెండు పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి.