Exclusive

నూతన పాఠశాల ప్రరంబోత్సవంలో పొన్నాడ సతీష్…

maxresdefault (1)

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం సీ.హెచ్. గున్నేపల్లి గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వై.సీ.పీ. పార్టీ ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మొదట ఆయన ప్రజ్వలన వెలిగించి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యకు ప్రాదాన్యతనిచ్చి ఈ నూతన పాఠశాలను నిర్మంచారన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి అప్పారావు, గొలకోటి వీరహను దుర్గా పద్మజ, గొలకోటి ఆంజనేయులు, నారాయణరావు, పెన్మెత్స చిట్టిరాజు, కోలా బాబ్ధి పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.