కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపి) విద్వేషాన్ని నింపే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం ధ్వజమెత్తారు. సమాన, నాణ్యమైన విద్యను అందించడంలో ఎన్ఈపి పూర్తింగా విఫలమైందని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు అల్లూరి సీతారామరాజు నగర్, ధీరార్ రాజేంద్రన్ ప్రాంగణం అంబేద్కర్ భవన్ లో ఉత్తేజభరితంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్న కుమార్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలు ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆదర్శ సాజి, ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ ఆల్ ఇండియా అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, తదితరులు నివాళులర్పించారు. మహాసభ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు గీతాలు ఆలపించారు.
నూతన విద్యా విధానం విద్వేషాలకు నాంది : ఐవి
![WhatsApp Image 2023-12-28 at 1.38.49 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-28-at-1.38.49-PM.jpeg?resize=1200%2C540&ssl=1)