Kakinada

నెహ్రూ విగ్రహాన్ని టీ.టీ.డీ. సెంటర్ లో ప్రతిష్టించాలి…

IMG-20231114-WA0004

స్వాతంత్ర్య సమరయోధులు 1964 లో నెలకొల్పిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని వారి స్మారక చిహ్నంగా బాలాజీ చెరువు సెంటర్ లో ప్రతిష్ట చేయాల్సిన బాధ్యత పౌర సమాజం పై వుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజుపేర్కొన్నారు. నెహ్రూ134వ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు (టీ.టీ.డీ.) సెంటర్ లో నెహ్రూ స్మారకఫ్లెక్సీ కి పూలదండలతో పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ మరణానంతరం అప్పటి స్వాతంత్ర్య సమర యోధులు 1964లో నవంబర్ 14న బస్ట్ సైజు సిమెంట్ విగ్రహాన్ని ప్రతిష్టించి జవహర్ వీధిగా, నెహ్రూ సెంటర్ ప్రజావేదికగా టీ.టీ.డీ. జంక్షన్ ప్రాచుర్యం పొందిందన్నారు. మూడు దఫాలుగా నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం నిలువెత్తు బొమ్మలు పెట్టడం దివంగత మున్సిపల్ చైర్ పర్సన్ ప్రభాజోసెఫ్ హయాంలో కాంస్య విగ్రహంగా రూపాంతరం చెందిందన్నారు. 2021 లో అనుచితంగా చేసిన కౌన్సిల్ తీర్మానం వలన అర్ధరాత్రి వేళలో అసాంఘిక శక్తుల ద్వారా పెకలించి వివేకానంద పార్కులోకి నెట్టించారన్నారు. ఆరు దశాబ్దాల క్రిందట స్థాపించిన బ్రస్ట్ సైజు నెహ్రూ విగ్రహాన్ని అదే స్థలంలో కాకినాడ ఫైల్స్ ననుసరించి సమరయో ధుల స్మారకంగా కొత్త ప్రభుత్వంలో పునః ప్రతిష్ట జరిపించడం పౌరసమాజం అభీష్ట మన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ