75 రిపబ్లిక్ డే సందర్భంగా కాకినాడ నగరంలో టి.టి.డి. జంక్షన్ జవహర్ వీధి నెహ్రూ విగ్రహం సెంటర్ వద్ద పౌర సంక్షేమ సంక్షేమ సంఘం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. త్వరలో జరగనున్న 2024-29 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే శాసనసభ్యుడు 1965 లో దేశప్రధాని మరణానంతరం ఏర్పాటైన నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ ప్రదర్శించారు.
స్మార్ట్ సిటీ కార్పోరేషన్ (2017-22) కౌన్సిల్ అమ్ముడుపోయి రు.10 లక్షల మున్సిపల్ నిధులతో పూర్వ పురపాలక కౌన్సిల్ నిర్మించిన కాంస్య విగ్రహాన్ని, విగ్రహ వేదిక షెల్టర్ ను స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ చరిత్రకు స్థానం లేకుండా దారుణంగా కూల్చివేసిందని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.