నేపాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది, ఈ ఘటనలో 65 పైగా పౌరులు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. 6.4 తీవ్రతతో ఇది సంభవించినట్టు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లిన ప్రాంతానికి 11 మైళ్ల దూరంలో జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అర్థరాత్రి కావటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నిద్రలో ఉంటుండగానే మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్లో సంభవించిన భారీ భూకంప తీవ్రత భారత్లోని ఢిల్లీని కూడా తాకినట్టు సమాచారం. స్వల్ప తీవ్రతతో ఏర్పడిన కదలికలకు ప్రజలు ఆందోళనకు గురైనట్టు చెబుతున్నారు. నేపాల్లో రక్షణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.