ఈ నెల 15 నుంచి 17 వరకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఖాట్మండు యూని వర్సిటీ నేపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ నేపాల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్కు మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. భారతిని ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లడుతూ… ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు నేపాల్ వెళ్తున్నట్లు తెలిపారు. విద్య యొక్క అంతర్జాతీయకరణ, వివిధ వర్సిటీలతో రీసెర్చ్ కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, ట్వినింగ్ ప్రోగ్రామ్స్ ను మొదలు పెట్టడం, జాయింట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు, విదేశీయ విద్యార్థులు భారతదేశంలో చదివేలాగా ఆకర్షించడం వంటి ప్రయోజనాలను తెలియచేయడం ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇరు దేశాలనుంచి 150 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని ఆమె తెలిపారు.
నేపాల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు ప్రొఫెసర్ డి. భారతికి ఆహ్వానం…
![WhatsApp Image 2024-02-14 at 10.36.25 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-10.36.25-AM.jpeg?resize=308%2C412&ssl=1)