యావత్ దేశం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ… ప్రతి ఉద్యోగి తమ సహకారం అందించాలని కోరారు. శాఖలోని పలు సమస్యలు, గత హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలు, పదోన్నతులు, ఇతర సమస్యలను వారు వివరించగా.. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. గత హయాంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి సహా వివిధ శాఖలు ఏ విధంగా నిరుపయోగంగా ఉన్నాయనే దానిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, వైఎస్సార్సీపీ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లిందని వివరించారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాం… -పవన్ కళ్యాణ్-
![pawan](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/pawan-4.jpg?resize=600%2C400&ssl=1)