స్థానిక ప్రజాప్రతినిదులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో స్థానిక స్వపరిపాలన సన్నగిల్లి సచివాలయాలకు మాత్రమే పరిమితమైందని దీనిపై హక్కులు అధికారాల కోసం సర్పంచ్ల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. సర్పంచులకు ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు . 14,15 ఆర్థిక నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం కి అతి త్వరలో బుద్ధి చెపుతామని హెచ్చరిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం…
![WhatsApp Image 2024-01-31 at 9.39.39 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-31-at-9.39.39-PM.jpeg?resize=1200%2C540&ssl=1)