పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజ నీతజ్ఞుడుగా స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రిగా భారత దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను బాలల దినో త్సవ వేడుకలను నెహ్రూ చిత్రప టానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటి oచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందిన పిదప మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకునేలా చేయడంలోనూ, విశిష్టమైన రాజ్యాంగాన్ని ఏర్పరుచుకోవటంలోనూ నెహ్రూ కృషి చేశారని ఆయనన్నారు. పేదరికం, నిరక్ష రాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న దశలో తిండి గింజల కోసం దిగుమతులపై పూర్తిగా ఆధారపడిన స్థితిని అదిగమించేందుకు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి పాలన వ్యవస్థలో రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు.
పంచవర్ష ప్రణాళికలు దేశానికి దిశానిర్దేశం చేశాయని. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పడ్డాయని. ప్రైవేటు బీమా కంపెనీలను విలీనంచేసి జాతీయి కరణకు పాటుపడ్డారన్నారు. ఇటీవల చంద్రయాన్ సాధించిన విజయం వెనుక ఆనాడు నెహ్రూ,వంటి అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఉన్నదనడంలో సందేహంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సెక్షన్ అధికారిని సుబ్బలక్ష్మి రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.