జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్, PAC సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో 3వ కార్తీక వన సమారాధన మహోత్సవం కాకినాడ రూరల్ కిరణ్ కంటి ఆసుపత్రి సమీపంలో గల మామిడి తోటలో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశ వన సమరాధనలో 20 వేల మంది పాల్గొన్నారు. ఉదయం పూజ కార్యక్రమంతో మొదలై, ఆట పాటలతో, అతిదుల ప్రసంశలతో, ఎంతో ఘనంగా జరిగింది, విజేతలకు (ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రో ఒవన్ తదితర బహుమతులను అతిదుల చేతులమీదుగా విజేతలకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ లు ముత్తా శశిధర్, తుమ్మల బాబు, వేగుళ్ల లీలా కృష్ణ, పితాని బాల కృష్ణ, తెలుగుదేశం నాయకులు జ్యోతుల నవీన్, చిక్కాల రామచంద్ర రావు గారు, తదితరులు పాల్గొన్నారు
పంతం నానాజీ ఆధ్వర్యంలో వన సమారాధన
![IMG-20231119-WA0012](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231119-WA0012.jpg?resize=1296%2C700&ssl=1)