కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న విషయంలో స్థానిక కమిషనర్ కి వినతిపత్రం అందచేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ఆ ఓట్లను త్వరగా నమోదు చేయాలని బిఎల్వోలు కి ఆదేశించమని కోరడం జరిగిందని అన్నారు.
కాకినాడ నగరంలో సొంత ఇంట్లో లేని వారికి, కరెంట్ బిల్లులేని వారికి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారికి వ్యక్తిగత పత్రాలు లేని కారణంగా ఓట్లు ఐడెంటిఫికేషన్ జరగలేని విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో 39 డివిజన్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఆట్ల సత్యనారాయణ, సతీష్, 43వ డివిజన్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.