కాకినాడ పటణం లో బ్యాంక్ పేట 34 వ డివిసన్ లో ఏ.పీ. కి జగన్ ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన సంక్షేమ పథకాల ప్రధర్శనా ఫలకాన్నిఆవిష్కరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృధ్ది, పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.
సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆధర్శంగా ఆంద్ర ప్రదేశ్ నిలుస్తుందన్నారు. జగన్ చేస్తున్న కృషి ని ప్రజలు గుర్తించి ఆయన్ని ఆశీర్వదించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మల్లి జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యాక్రమంలో కాకినాడ అర్బన్ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్ర శేఖర్ రిడ్డి, కౌడా చైర్మెన్ చంద్రకళా దీప్తి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.