సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో 27వ తేదీ శుక్రవారం “బాబు ష్యూరిటీ…భవిష్యత్తు కు గ్యారంటీ” పేరుతో నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సమన్వయ కమిటీ సభ్యులు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు సామర్లకోట రూరల్ మండలం పనసపాడు గ్రామంలోని విజయ సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద బిఎస్బిజి కార్యక్రమం, ఓటర్ వెరిఫికేషన్ పై చర్చించడానికి పెద్దాపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు,క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జెస్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ స్థాయి కార్యకర్తలందరు విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యే చిన రాజప్ప తెలిపారు