షెడ్యూల్ పరిశ్రమలు లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతన చట్టం ద్వారా వేతనాలు పెంచాలని, తూర్పు గోదావరి జిల్లా ఎయఫ్టియు ప్రధాన కార్యదర్శి బొత్స ఏసుబాబు డిమాండ్ చేశారు. ఆయన సామర్లకోట బళ్ళమార్కేట్ సెంటర్ లో నిర్వహించిన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం పెద్దాపురం డివిజన్ ఎయఫ్టియు అధ్యక్షుడు ఉప్పాడ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిదులుగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు, డి.నారాయణ మూర్తిలు హాజనయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు మాట్లాడుతూ.. షెడ్యూల్ పరిశ్రమలు అనగా ఆయిల్ పర్టిలైజర్స్, పోర్ట్, రొయ్యల పరిశ్రమలు, టైల్స్, పెస్టిసైడ్స్, పుడ్ తదితర పరిశ్రమలు లో పనిచేసే కార్మికులకు వేతన సవరణ ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
అలాగే మున్సిపల్, పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పరిశ్రమలలో మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించాలని, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చెయ్యాలని కోరారు. అలాగే రైస్ మిల్లులలో పనిచేసే కార్మికులందరికీ ఇయస్ఐ, పి.ఎఫ్. అమలు చెయ్యడమే కాకుండా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎయఫ్టియు సామర్లకోట అధ్యక్షుడు ముప్పిడి మణ్ణియ్య, మేకల సదానందం, సింగం సత్యనారాయణ, సవరం నాగేశ్వరరావు, మోర్త అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరగాలి.. ఎయఫ్టియు జిల్లా కార్యదర్శి ఏసుబాబు..
![WhatsApp Image 2023-10-14 at 7.42.00 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-14-at-7.42.00-PM.jpeg?resize=1280%2C700&ssl=1)