ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పర్యవరణ హితమైన మొక్కులు నాటి, ప్లాస్టిక్ బ్యాగ్ వల్ల కలిగే అనర్ధాలు, ప్రకృతి వానరుల సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ లో పి.ఓ. షేక్ మీరా, ప్రొఫెసర్ డా.కె. మనోహర్ అద్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే. మనోహర్ మాట్లాడుతూ… సంప్రదాయ వనరుల నుండి విద్యుత్, సౌరశక్తి తో నడిచే వాహనాలకు మారాలి అని ప్రజా రవాణా ఎక్కువ గా ఉపయోగించాలని సూచించారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు అమలు చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీనివాస రెడ్డి అన్నారు. జీవామృత తయారీ విధానం, తడి చెత్త నుండి ఎరువు తయారుచేసి వాటి ఉపయోగాలను గురించి తెలియచేసారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, వృద్దులు, పిల్లలు పాలుగొన్నారు.
పర్యావరణం పై అవగాహన సదస్సు…
![30e06be5-ef0a-4284-9ff6-b3c8d21ebb1c](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/30e06be5-ef0a-4284-9ff6-b3c8d21ebb1c.jpg?resize=1280%2C700&ssl=1)