తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జేగురుపాడు జగనన్న కాలనీలో విద్యుద్దీకరణ కొరకు రూ. 3.58 కోట్ల రూపాయలతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కడియం సుబ్బారావు పేటలో రూ. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యి కేంద్రాన్ని ప్రారంభించారు.
కడియంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మల్టీపర్పస్ పనులను ప్రారంభించారు. ఎస్సీ పేటలో నిర్మించిన వాలీబాల్ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ గోడ, అరుంధతి పేట రామాలయం వెనుక జగజ్జీవన్ రామ్ మల్టీపర్పస్ సెంటర్ పనులు ప్రారంభించి ఆనంతరం రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.