జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు శనివారం శ్రీకారం చుట్టనున్నారని వెళ్లడించారు. వారాహి విజయభేరి యాత్ర పేరిట నిర్వహించనున్న ఎన్నికల ప్రచారానికి శనివారం మధ్యాహ్నం గం. 12. 30 నిమిషాలకు పిఠాపురం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా పిఠాపురంలో కొలువై ఉన్న శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం గం. 1.30 నిమిషాలకు దత్త పీఠాన్ని దర్శించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు దొంతమూరులోని పిఠాపురం టీ.డీ.పీ. ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకు చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరీ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలు నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు చురుగ్గా చేస్తున్నారు.