జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎం.పీ., టి.డి.పి. నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ని కలిశారు.ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువా కప్పారు. ఈ సమావేశంలో మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు. తిరుపతి లోక్ సభ స్థానం బీ.జే.పీ. అభ్యర్థి వరప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.