పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్ గారు టిమ్ )ముఖ్య అతిధిగా పాలుగోన్నారు. ముందుగా శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ… అంబేద్కర్ గారు పేద బడుగు వర్గాల కోసం ఎంతగానో శ్రమించారన్నారు. తన జీవితాన్ని దారపోశారన్నారు. అయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోను ఎంతో ప్రేరణ కలిగిస్తుందని ఆయన తెలిపారు. చిన్నప్పుడు నుండి అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడ్డారని, కష్టపడి ఎలా చదువుకున్నారో అందరికీ వివరించారు.
ఈ రోజుల్లో చాలా మందికీ తెలియదు, అందువలన అయన జీవితంలోని ముఖ్య ఘట్టములును , విద్యర్థిలుకు, ప్రజలుకు తెలిసేలా స్కూల్, కాలేజీలు, ప్రభుత్వంలు అవగాహనా కార్యక్రమంలు నిర్వహించలని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆచంట మండలం వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అరిగెల్లా పుల్లారావు , తదితరులు పాలుగోన్నరు.