పాట్నా యూనివర్శిటీలో ధారుణ విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిపై కొంత మంది దాడి చంప్పేసారు. బీహార్ రాజధాని నగరంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, పాట్నా యూనివర్సిటీ క్యాంపస్లో సోమవారం కొందరు గుర్తు తెలియని దుండగులు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కొట్టి చంపారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు హర్ష్రాజ్గా గుర్తించబడిన 22 ఏళ్ల యువకుడు పాట్నాలోని బీఎన్ కాలేజీలో ఎల్.ఎల్.బీ. చివరి సంవత్సరం చదువుతున్నాడు. హర్ష్ మధ్యాహ్నం తన పరీక్షా కేంద్రం నుండి బయటకు వస్తుండగా కొందరు ముసుగులు ధరించి అతనిని కొట్టడం ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడని పాట్నా పోలీసుల ప్రకటనలో తెలిపారు.