పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది అలసత్వం పై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఒకటవ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్, శానిటరీ సెక్రటరీ జగన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ నాగ నరసింహారావు ఒకటవ సర్కిల్ పరిధిలోని ఆర్టీవో జంక్షన్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో పారిశుధ్య నిర్వహణలో లోపాలను గుర్తించారు. చెత్త పేరుకుపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గుర్తించి అక్కడి ఇన్స్పెక్టర్, సెక్రటరీ, కార్మికుల తీరుపై మండిపడ్డారు. ఇద్దరు కార్మికులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంహెచ్ఓ డాక్టర్ పృద్విచరణ్ ను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇదే పరిస్థితి పునరావృత్తమైతే మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా పారిశుద్ధ్య విభాగానికి సహకరించి చెత్తను రోడ్లపై వేయొద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజల మధ్య సమన్వయం ఉన్నప్పుడే మెరుగైన పారిశుధ్య నిర్వహణ సాధ్యమని కమిషనర్ స్పష్టం చేశారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ జిలాని, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం…. శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలకు షోకాజ్ నోటీస్, ఇద్దరు కార్మికుల సస్పెన్షన్
![WhatsApp Image 2023-10-19 at 5.34.09 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-19-at-5.34.09-PM.jpeg?resize=1296%2C700&ssl=1)