కాకినాడలో పారిశుద్ధ్య పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పరిశిలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య పనుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలను అందించాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సేవా సిబ్బందితో మెరుగైన పారిశుధ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో చెత్త ఎక్కడా పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చెత్తను రోడ్ల పైన డ్రైనేజీలలోను వేయకుండా ప్రజలు, వ్యాపార వర్గాలలో అవగాహన కల్పించాలని సూచించారు.