పార్లమెంటరీ నియమాలు మరియు ప్రవర్తనను అనుసరించాలని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎం.పీ. లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కోరారు. ఎం.పీ. లు తమ నియోజకవర్గాలకు సంబంధించిన పౌర విషయాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా ఆయన కోరారు. ఎన్.డీ.ఏ. ఎం.పీ. ల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… మొదటిసారిగా కాంగ్రెసేతర నాయకుడు మూడవసారి ప్రధాని కావడం వల్ల ప్రతిపక్షాలు తనపై కలత చెందాయని అన్నారు.
ఏజెన్సీ ప్రకారం… ఏదైనా సమస్యపై మీడియా ముందు వ్యాఖ్యానించే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఎం.పీ. లను ప్రధాని మోదీ కోరారు. ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించాలని ఎం.పీ. లను ప్రధాని మోదీ కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.