గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించినట్లుగా సోమవారం నుండి అమలులోకి వచ్చే అన్ని రకాల్లో అమూల్ పాల ధరలు లీటరుకు 2 రూపాయలు పెరిగాయి. పాలతో ముడిపడి ఉన్న మొత్తం కార్యాచరణ, ఉత్పత్తి ఖర్చులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోబడిందని అమూల్ సంస్థ తెలిపింది. అమూల్ పాల ధరలను అన్ని రకాల్లో లీటరుకు రూ. 2 పెంచామని, ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది.
దీని కారణంగా దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమూల్ మిల్క్ పౌచ్ ధర లీటరుకు 2 రూపాయలు పెరుగుతుంది. జూన్ 3 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని వేరియంట్లలో అమూల్ ధర లీటరుకు రూ. 2 పెంచినట్లు GCMMF MD జాయెన్ మెహతా తెలిపారు. అంతకుముందు ఫిబ్రవరి 2023లో పాల ధరను పెంచింది. రైతుల పెరిగిన ఉత్పత్తి వ్యయానికి పరిహారం చెల్లించేందుకు ఈ పెంపు తప్పనిసరని పేర్కొంది.