ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కోరారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా కష్టం, నా శ్రమ.. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. కూటమి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా నిలబడుతుందని తెలపారు. శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం నుంచి భారీ రోడ్ నిర్వహించారు. ప్రతి అడుగు జన ప్రభంజనం మధ్య ఈ రోడ్ షో సాగుతోంది. యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంపవన్ కళ్యాణ్ కి మద్దతుగా రోడ్ల మీదకు రాగా, దారిపొడుగునా మహిళలు హారతులు, పూల వర్షంలో తడిసి ముద్దవుతూ ముందుకు సాగారు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతూ రోడ్ షో కొనసాగించారు.
పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో…
![fef215c4-3e07-48c2-a7bc-f5f25f562738](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/fef215c4-3e07-48c2-a7bc-f5f25f562738.jpg?resize=1280%2C700&ssl=1)