పిఠాపురంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి వై.సీ.పీ. పార్టీ కి చెందిన నాయకులు గొండవరపు నూకరాజు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుంపట్ల సత్యనారాయణ, అమరాది వల్లి, వీరబాబు, రాధాకృష్ణ, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురంలో జనసేనలో చేరిన 200 కుటుంబాలు…
![n](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/n.jpg?resize=1024%2C682&ssl=1)