ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎం.పీ. లను చేతిలో పెట్టుకొని వై.సీ.పీ. ప్రజలను భయపెట్టింది అని అన్నారు. కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, అఘాయిత్యానికి గురైన సుగాలి ప్రీతి తల్లి బయటకు వస్తే ప్రాణాలను పణంగా పెట్టి బయటకు వచ్చానన్నారు. జనసేన పార్టీని ఒక్క ఎన్నికల కోసం స్థాపించలేదు. ఆంధ్ర ప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం స్థాపించానని ఆయన అన్నారు. ఒక తరం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
పిఠాపురంలో బహిరంగ సభలో జనసేన అధినేత…
![7055a336-cb75-4246-9210-122933df9111](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/7055a336-cb75-4246-9210-122933df9111.jpg?resize=1040%2C694&ssl=1)