ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆకంక్షించారు. సర్వ మతాల్లోని వారు, సర్వ ప్రాంతాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతోందని చెప్పారు. పిఠాపురం నుంచే ఈ మార్పు మొదలు కాబోతోందన్నారు.
శ్రీ పురూహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవెనలు, బంగారు పాపమ్మ అండదండలతో కచ్చితంగా పిఠాపురం నుంచి విజయ ప్రస్థానం ప్రారంభించబోతున్నానని ఆయన అన్నారు. పిఠాపురం రావాలని మొదటి నుంచి కోరుకున్న శ్రీ ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దశ దిశ చూపాలని కోరుకుంటున్నానన్నారు.
ఉగాది వేడుకల నిమిత్తం పిఠాపురం విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఆడపడుచులు గుమ్మడికాయలతో దిష్టి తీసి నూతన గృహంలోకి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, పార్టీ నేతలు వేములపాటి అజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్, కళ్యాణం శివ శ్రీనివాస్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.